షర్మిల ను కలిసిన ప్రకాశం జిల్లా పీసీసీ అధ్యక్షుడు

74பார்த்தது
షర్మిల ను కలిసిన ప్రకాశం జిల్లా పీసీసీ అధ్యక్షుడు
పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ను విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ప్రకాశం జిల్లా పిసిసి అధ్యక్షులు షేక్. సైదా గురువారం కలిశారు. జిల్లాలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు, దొనకొండలో పారిశ్రామిక కారిడార్ గురించి కొద్దిసేపు చర్చించారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని, కాంగ్రెస్ నాయకులకు షర్మిల సూచించారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పాలపర్తి విజయ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி