కృష్ణానది తీర ప్రవాహంతో 130 ఎకరాల్లో పంట నష్టం

60பார்த்தது
కృష్ణానది తీర ప్రవాహంతో 130 ఎకరాల్లో పంట నష్టం
కృష్ణా నది వరద నీటి ప్రవాహంతో 91 మంది రైతులు పంట నష్టపోయారని గురువారం వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ అధికారులు తెలిపారు. దాచేపల్లి కృష్ణానది తీరప్రాంత గ్రామాలైన పొందుగల, రామాపురం, కాట్రపాడు గ్రామాలలో పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. 75 ఎకరాలలో పత్తి పంట, 15 ఎకరాలలో వరి, 41 ఎకరాలలో మిర్చి పంట నష్టపోయినట్లు అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేశామన్నారు.

தொடர்புடைய செய்தி