సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు తూర్పు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ అన్నారు. శనివారం రాత్రి నల్లచెరువులో స్థానికులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని చెప్పారు. లాలాపేట సీఐ శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.