విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

77பார்த்தது
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రేపల్లె గ్రామీణ సిఐ సురేష్ కుమార్ అన్నారు. మంగళవారం నగరంలోని ఎస్ వి ఆర్ ఎం కళాశాలలో మత్తు పదార్థాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో నగరం ఎస్ఐ భార్గవ్, పోలీస్ సిబ్బంది , విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி