AP: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల గురువారం కౌంటర్ ఇచ్చారు. నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో.. రాష్ట్ర సంపదను దోచుకున్నది ఎవరో ప్రజలకు తెలుసునని వెల్లడించారు. ఐదేళ్లు కుంభకర్ణుడిలా నిద్రపోయారని.. బీజేపీకి జగన్ దత్తపుత్రుడిలా మారారని షర్మిల మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని వైసీపీ ప్రశ్నించాలని.. అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామాలు చేయాలని సూచించారు.