మహిళ మెడలోని గొలుసు తెంచుకుని పారిపోయిన యువకులు (వీడియో)

1073பார்த்தது
ఏపీలోని తూ.గో జిల్లా తుని పట్టణంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. వెలమ కొత్తూరు గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళ పోస్ట్‌ ఆఫీసు వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా, దారి కాచిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని బంగారు గొలుసు తెంచుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ దొంగలు వచ్చిన బైక్‌ కూడా విశాఖలోని ఓ ఇంట్లోంచి కొట్టుకొచ్చినట్టు తెలిసింది.

தொடர்புடைய செய்தி