యాదాద్రి రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం

53பார்த்தது
యాదాద్రి రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామికి సోమవారం సందర్భంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రభాతవేళలో మొదటగా పరమశివుడిని కొలుస్తూ సుమారు గంటన్నర పాటు జరిగిన రుద్రాభిషేకంలో భక్తులు మమేకమయ్యారు. పరమశివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకించి, విభూతితో అలంకరణ చేసి, బిల్వపత్రాలతో అర్చించారు. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

தொடர்புடைய செய்தி