యూపీలోని ఇటావాలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. ఆగ్రా-వారణాసి వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రాంభోత్సవం సందర్భంగా భారీగా ప్రజాప్రతినిధులు తరలి వచ్చారు. ఫ్లాగ్-ఆఫ్ సమయంలో తోపులాట జరిగింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే సరితా భడోరియా అదుపు తప్పి వందే భారత్ రైలుకు ఎదురుగా రైల్వే ట్రాక్పై పడిపోయింది. రైలు ముందుకు కదలకపోవడంతో ఎమ్మెల్యేకు ప్రాణాపాయం తప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.