కాజీపేట మండలం భట్టుపల్లి హవేళి కొత్తపల్లిలో అనారోగ్యం కారణంగా జీవితంపై విరక్తి చెంది మున్సిపాలిటి కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. నాగపురి కుమారస్వామి కొద్ది నెలలుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. హాస్పిటల్ కి వెళ్లి మందులు వాడిన నయం కాకపోవడంతో తన పాత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మడికొండ ఎస్సై రాజన్ బాబు తెలిపారు.