లక్షల విలువైన ప్లేట్ లెట్స్ యంత్రం మూలకు

545பார்த்தது
వరంగల్ ఎంజీఎంలో ఎమ్మెల్యే నాయిని తనిఖీల్లో భాగంగా ఆరునెలలుగా మూలనపడి ఉన్న సుమారు రూ. 50 లక్షల విలువైన ప్లేట్లెట్లు వేరు చేసే యంత్రాన్ని గురువారం గుర్తించారు. డెంగీ వ్యాధిగ్రస్థులకు అవసరమైన యంత్రం ఎందుకు ఉపయోగించడం లేదని ప్రశ్నించారు. ప్రైవేటుగా ప్లేట్లెట్స్ సపరేషన్ కు రూ. 10 వేలు వసూలు చేస్తున్నారన్నారు. స్థలం లేక యంత్రాన్ని అమర్చలేదని అధికారులు తెలిపారు. వారం రోజుల్లోగా దానిని సిద్ధం చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி