డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే డీసెట్-24 కు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా వరంగల్ డీఈవో వాసంతి గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. జూలై 10న నిర్వహించే డీసెట్ కు జూన్ 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.