గట్టు మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

65பார்த்தது
హనుమకొండ జిల్లా వేలేరు మండలం మళ్లీకుదుర్ల గ్రామంలో కొలువై ఉన్న గట్టు మల్లికార్జున స్వామి దేవాలయంలో బుధవారం భక్తుల కోలాహలం నెలకొంది. శ్రావణమాసం సందర్భంగా భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ముందుగా ఒగ్గు పూజరులచే స్వామివారికి పట్నాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

தொடர்புடைய செய்தி