సుమారు 80 క్వింటాళ్ల పత్తి పట్టివేత

1862பார்த்தது
సుమారు 80 క్వింటాళ్ల పత్తి పట్టివేత
జనగామ జిల్లా జాఫర్ గడ్ మండలంలోని తిమ్మంపేట గ్రామంలో స్టేషన్ ఘనపూర్ కు చెందిన వ్యాపారి రైతుల వద్ద తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం రాగా మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు ఆదేశంతో మార్కెట్ డైరెక్టర్ పెంతల రాజ్ కుమార్ సిబ్బందితో కలసి 80క్వింటాల పత్తి లోడును స్వాధీనం చేసుకుని, తదుపరి చర్యల కోసం మార్కెట్ కు తరలించారు. మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు మాట్లాడుతూ. రైతులు ఎవరూ కూడా దళారుల మాటలు నమ్మి తక్కువ ధరకు పత్తిని అమ్మి నష్టపోకూడదన్నారు. అలాగే పంటను మార్కెట్ కు తీసుకువచ్చి మంచి ధర పొందాలని రైతులను కోరారు. ఇప్పటికైనా చిల్లర కాంటాల మానకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో మార్కెట్ సిబ్బంది ప్రవీణ్, అశోక్ పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி