మా భూమిని మాకు ఇప్పించాలి

55பார்த்தது
తమ భూమిని తమకు ఇప్పించి తమను ఆదుకోవాలని భూబాధితులు ప్రభుత్వాన్ని కోరారు. చిల్పూర్ మండలం శ్రీపతిపల్లి గ్రామానికి చెందిన నిరుపేదలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి ఎకరం చొప్పున భూమిని కేటాయించింది. అయితే ఈ భూమిని ఇటీవల కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తమ భూమిని తమకి ఇప్పించాలని కోరుతూ బాధితులు సోమవారం నిరసనకు దిగారు. అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி