కాజీపేట ఆవరణలో నూతన బస్ స్టాండ్ నిర్మాణం కోసం పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఏడిఆర్ఎం గోపాల్ లతో కలిసి వరంగల్ ఎంపీ కడియం కావ్య మంగళవారం అధికారులతో కలిసి మ్యాప్ ద్వారా స్థలాన్ని పరిశీలించారు. వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 30 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఎన్నో సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నామన్నారు.