జనగామ జిల్లా జఫర్గడ్ మండలం రఘునాథపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎడ్ల వెంకటయ్య బుధవారం ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.