అంబేద్కర్ కార్మికులకు హక్కులు కల్పించారు

80பார்த்தது
అంబేద్కర్ కార్మికులకు హక్కులు కల్పించారు
హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో తాపీ మేస్త్రిహమాలి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం మేడే వేడుకలు నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ హాజరై ఎర్ర జెండాను ఆవిష్కరించారు. మన దేశంలో కార్మికులకు హక్కులు కల్పించింది డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అని ఆయన లేకుండా దేశంలో కార్మిక చట్టాలు లేవని అన్నారు. ఆయన చేసిన కృషి త్యాగాలను మేడే సందర్భంగా కార్మికులు కమ్యూనిస్టులు గుర్తు చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி