మేళతాలలతో ఉపాధ్యాయులకు విద్యార్థులకు గ్రామస్థుల స్వాగతం

76பார்த்தது
జనగాం జిల్లా పాలకుర్తి మండల పరిధిలోని గూడూరు మండలం పాటిమీదిగూడెం గ్రామంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు గ్రామ ప్రజలు వినూత్నంగా స్వాగతం పలికారు. బుధవారం పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న సందర్భంగా వేసవి సెలవుల అనంతరం పాఠశాలకు వస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులపై పూలు చల్లుతూ మేళతాలలతో ఘనంగా స్వాగతం పలికారు. పాఠశాలకు విద్యార్థులను ఆకర్షించాలనే ఉద్దేశ్యంతోనే ఇలా వినూత్న స్వాగతం పలికినట్లు గ్రామస్థులు తెలిపారు.

தொடர்புடைய செய்தி