పాలకుర్తి సోమన్నకు పాలాభిషేకం

75பார்த்தது
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో నిర్జల ఏకాదశి సందర్బంగా అర్చకులు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజాము నుండే భక్తుల సందడి మొదలైంది. ఈ సందర్భంగా స్వామి వారికి నిర్వహించిన పాలాభిషేకంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. పూజల అనంతరం భక్తులకు ఆశీర్వచనం తో పాటు తీర్థప్రసాదాలను అర్చకులు అందించారు.

தொடர்புடைய செய்தி