విద్యుత్ షాక్ తో పాడి బర్రె మృతి

56பார்த்தது
విద్యుత్ షాక్ తో పాడి బర్రె మృతి
జనగాం జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు గ్రామంలో విద్యుత్ షాక్ తో పాడి బర్రె మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సోమవారం స్థానికుల సమాచారం ప్రకారం గ్రామానికి చెందిన సోమనర్సయ్య కు చెందిన 80 వేల రూపాయల విలువ చేసే పాడి బర్రె విద్యుత్ షాక్ కు గురై మృతి చెందినట్లు తెలిపారు. సంఘటనతో సోమనర్సయ్య కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం తక్షణమే కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி