నీట్ పేపర్ లీకేజీపై వామపక్ష విద్యార్థి సంఘాలు గళమెత్తాయి. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మహబూబాబాద్ నియోజకవర్గం, జిల్లా కోర్టు అంబేద్కర్ విగ్రహం నుంచి నెహ్రూ సెంటర్ విగ్రహం వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ. నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేనియెడల వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామన్నారు.