పురుగుల మందు తాగి యువ రైతు ఆత్మహత్య

1708பார்த்தது
పురుగుల మందు తాగి యువ రైతు ఆత్మహత్య
పురుగుల మందు తాగి యువ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం రాత్రి ఇనుగుర్తి మండల శివారులో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు. ఇనుగుర్తికి చెందిన సంగెం శ్యామ్‌(35) ఆదివారం సాయంత్రం ఇనుగుర్తి శివారులోని తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. రాత్రి వరకు కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వ్వవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలు తెలియరాలేదు. మృతుడికి భార్య సరిత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ విషయంపై ఎస్సై తిరుపతిని వివరణ కోరగా రైతు ఆత్మహత్య ఘటనపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி