జిల్లా కేంద్రమైన జనగాం నగరంలోని ఓ సినిమా థియేటర్ నుండి ధర్మాకంచ ప్రాంతానికి వెళ్లే ప్రధాన మార్గం మొత్తం గుంతల మయంగా మారి ప్రమాదజరంగా ఉందని స్థానికులు తెలిపారు. బుధవారం ఉదయం వారు మాట్లాడుతూ పలుసార్లు పురపాలక సంఘం అధికారులకు రెండు సంవత్సరాలగా తెలిపిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోచమ్మ గుడి దగ్గర బోనాల పండుగ ఉన్నందున ఇక ఎవ్వరి ఇంటిముందు వారే గుంతలలో మట్టి పోసుకుంటున్నట్లు వివరించారు.