జనగామ జిల్లా లో శనివారం కురిసిన అకాల వర్షాలకు వరి, మామిడి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. జనగామ మండలంలోని ఎల్లంల, సిద్ధంకి, పెంబర్తి గ్రామాలలో అకాల వర్షానికి నష్టపోయిన పంటలను ఆదివారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సందర్శించి, రైతులను పరామర్శించారు. నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కోరారు.