ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా సోమవారం ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించారు. విరాట్ కోహ్లీ 29 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేసుకున్నారు. ఐపీఎల్లో కెరీర్లో విరాట్ కోహ్లీకి 57వ అర్థశతకం. ఈ సీజన్లో కోహ్లీకి ఇది రెండవ హాఫ్ సెంచరీ. దీంతో 8.4
ఓవర్కు ఆర్సీబీ స్కోర్ 94/1గా ఉంది. క్రీజులో పడిక్కల్ (37), కోహ్లీ (51) ఉన్నారు.