ఉత్తరప్రదేశ్‌లో ఆరో తోడేలును చంపిన గ్రామస్థులు

67பார்த்தது
ఉత్తరప్రదేశ్‌లో ఆరో తోడేలును చంపిన గ్రామస్థులు
ఉత్తరప్రదేశ్‌ ప్రజలను వణికిస్తున్న ఆరో తోడేలు ఎట్టకేలకు హతమైంది. బహరాయిచ్‌ జిల్లా ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్న ఆరో తోడేలును గ్రామస్థులు మట్టుపెట్టారు. జిల్లాలోని తమాచ్‌పుర్‌ గ్రామంలో ఈ ఘటన శనివారం చోటు చేసుకొంది. అటవీశాఖాధికారులు దాని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నారు. దీంతో ఆపరేషన్‌ భేడియా కొలిక్కి వచ్చినట్లైంది. కాగా, గత కొంత కాలంగా తోడేళ్లు ప్రజలపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.

தொடர்புடைய செய்தி