ఏపుగా పెరిగిన కంది ఎండిపోతుంది: రైతు

57பார்த்தது
గండీడ్ మండలం లింగాయపల్లి గ్రామానికి చెందిన చిన్న దోమ మొగలయ్య రెండున్నర ఎకరాల కంది పంట సాగు చేశారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట పూర్తిగా చనిపోతుందని ఆవేదన వ్యక్తపరిచారు. దాదాపు 30 వేల రూపాయలు పెట్టుబడి పెట్టానని, ఏపుగా పెరిగి అధిక దిగుబడి ఇస్తుందని తరుణంలో ఇలా ఎండిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టం చెల్లించి ఆదుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி