రోగి ఫోన్ చూస్తుండగానే అతని మెదడులోని కణితిని తొలగించిన యూపీ వైద్యులు

61பார்த்தது
రోగి ఫోన్ చూస్తుండగానే అతని మెదడులోని కణితిని తొలగించిన యూపీ వైద్యులు
ఉత్తరప్రదేశ్ లోని కళ్యాణ్ సింగ్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వైద్యులు అవేక్ క్రానియోటమీ అనే టెక్నిక్‌తో హరిశ్చంద్ర అనే 56 ఏళ్ల వ్యక్తి మెదడులోని కణితిని తొలగించారు. ఈ విధానంలో ఆపరేషన్ జరిగే భాగానికే మత్తు ఇస్తారు. శస్త్రచికిత్స సమయంలో రోగి మెలకువగా ఉండి ఫోన్ ను చూసుకుంటూ కాళ్లను కదిలిస్తూ ఉన్నాడు. ఈ టెక్నిక్ చేతులు, కాళ్ల పని తీరును నియంత్రించే నరాలకు హాని కలగకుండా కణితిని తీసేందుకు దోహదపడుతుంది.

தொடர்புடைய செய்தி