యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బదౌన్ జిల్లా మొరాదాబాద్-ఫరూఖాబాద్ హైవేపై రంజాన్ పండుగకు వెళ్తున్న ఓ ఆటోను.. వేగంతో వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మరణించడంతో ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.