విషాదం.. ఇద్దరు కవలలు మృతి (వీడియో)

58பார்த்தது
TG: హైదరాబాద్ లోని బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. జీడిమెట్ల పారిశ్రామికవాడలోని రెనోవేషన్ చేస్తున్న సాబూరి ఫార్మా కంపెనీలో ఇద్దరు (కవలలు) మృతి చెందారు. కెమికల్ సంపులు క్లీన్ చేసేందుకు రాము(32), లక్ష్మణ్ (32) వచ్చారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఒకరు కెమికల్ సంపులో పడి మృతి చెందారు. సోదరుడిని కాపాడే ప్రయత్నంలో లక్ష్మణ్ కూడా సంపులో పడి చనిపోయాడు. దీంతో మృతుల కుటుంబాల్లో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.

தொடர்புடைய செய்தி