పండగ పూట విషాదం.. పిల్లలతో కలిసి బావిలో దూకి తండ్రి ఆత్మహత్య

60பார்த்தது
పండగ పూట విషాదం.. పిల్లలతో కలిసి బావిలో దూకి తండ్రి ఆత్మహత్య
పండగ పూట కామారెడ్డి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. తాడ్వాయి మండలం నందివాడ గ్రామానికి చెందిన చిట్టపు శ్రీనివాస్ పండగ రోజు పిల్లలు విగ్నేష్ (7), అనిరుద్ (5)లతో కలిసి పాలపిట్టను చూడటానికి వెళ్ళాడు. అయితే ఆ ఇద్దరు చిన్నారుల మృతదేహాలు గ్రామ శివారులోని ఓ బావిలో పైకి తేలాయి. తండ్రికి సంబంధించిన ఫోన్, చెప్పులు బావి గట్టున ఉండటంతో అతను కూడా చనిపోయి ఉంటాడని గ్రామస్తులు బావిలో గాలింపు చేపడుతున్నారు. పండగ పూట చిన్నారుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

தொடர்புடைய செய்தி