బంకించంద్ర చటోపాధ్యాయ పేరు తెలియని వారంటూ ఉండరు. ఎందుకంటే వందేమాతరం గీత రచయితగా ఆయన యావత్భారతానికి సుపరిచితులే. ఆయన రచయిత, కవి, పాత్రికేయుడు. ఆయన వందే మాతరం మొదట సంస్కృత స్తోత్రంలో భారత దేశాన్ని మాతృదేవతగా వ్యక్తీకరించారు. ఆ గీతం ద్వారా భారత స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కార్యకర్తలను ప్రేరేపించారు. ఆయనను ఎందుకు గుర్తు చేస్తున్నామంటే.. ఇవాళ బంకించంద్ర ఛటర్జీ పుట్టినరోజు.