పశువుల మేత కోసం వెళ్లిన మహిళపై దాడి చేసిన పులి (వీడియో)

59பார்த்தது
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. హజారా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఒక మహిళపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. రామ్ శంకర్ అనే వ్యక్తి భార్య ఆర్తి పశువులకు మేత కోసం పొలానికి వెళ్లగా, చెరకుతోటలో దాక్కున్న పులి అకస్మాత్తుగా దాడికి పాల్పడింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

தொடர்புடைய செய்தி