టీ20 ప్రపంచకప్ ట్రోఫీ గెలిచిన అనంతరం టీమిండియా ఆటగాళ్లు రేపు భారత్ రానున్నారు. వెస్ట్ ఇండీస్లోని బార్బడోస్ నుంచి వారు భారత్ చేరుకోనున్నారు. ఈ క్రమంలో వారిని ప్రధాని మోదీ కలవనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు టీమిండియా ప్లేయర్లతో మోదీ సమావేశం కానున్నారు. టీ20 ప్రపంచకప్ సాధించిన జట్టును అభినందించనున్నారు.