శివాజీ విగ్రహం పడిపోవడానికి కారణమిదే: షిండే

83பார்த்தது
మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఏర్పాటు చేసిన 35 అడుగుల శివాజీ విగ్రహం కుప్పకూలడంపై సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. విగ్రహం బలమైన గాలుల ప్రభావంతో కూలినట్లు తెలిపారు. ఇది చాలా దురదృష్టకరమని, శివాజీని తాము భగవంతుడిలా చూస్తామని చెప్పారు. ఇది భావోద్వేగాలతో ముడిపడిన అంశమన్నారు. రాష్ట్ర మంత్రి ఈ అంశంపై పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ విగ్రహాన్ని ప్రధాని మోదీ, సీఎం షిండే గత ఏడాది చివర్లో ఆవిష్కరించారు.

தொடர்புடைய செய்தி