సుప్రీంకోర్టులో టెలికాం కంపెనీలకు చుక్కెదురు

52பார்த்தது
సుప్రీంకోర్టులో టెలికాం కంపెనీలకు చుక్కెదురు
టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తమ AGR బకాయిలపై సుప్రీం నిర్ణయాన్ని పునర్విచారణ చేయాలంటూ టెలికాం సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. AGR బకాయిల గణనలో భారీ తప్పిదం చోటుచేసుకుందని.. తమ పిటిషన్‌ను ఓపెన్ కోర్టులో విచారించాలని AIRTEL, ఒడాఫోన్ గతేడాది కోర్టును కోరింది. తాజాగా ఈ అంశంపై దాఖలైన క్యూరేటివ్ పిటిషన్‌ను సీజేఐ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సంజీవ్‌కుమార్‌, జస్టిస్‌ బీఆర్‌ గవయ్‌లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది.

தொடர்புடைய செய்தி