తెలంగాణపై కేంద్రం వివక్ష ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం మొదలయ్యే ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై ఎన్డీఏ సర్కార్ వివక్ష చూపిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్ను రూపంలో రూపాయి వెళ్తుంటే 43పైసలు మాత్రమే కేంద్రం నుంచి తిరిగి వస్తోందని, అదే బిహార్కు రూ.7, యూపీకి రూ.6 ఇస్తోందని అన్నారు.