నిత్యవసర వస్తువుల పంపిణీ సక్రమంగా జరగలేదు

54பார்த்தது
నిత్యవసర వస్తువుల పంపిణీ సక్రమంగా జరగలేదు
కోదాడ లోని పలు వార్డుల్లో వరద బాధితులకు నిత్యవసర వస్తువుల పంపిణీ సక్రమంగా జరగలేదని కోదాడ బీజేపీ పట్టణ అధ్యక్షులు సాతులూరి హనుమంతరావు ఆరోపించారు. శనివారం కోదాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరద బాధితులను గుర్తించడానికి అధికారులు సర్వేకు వచ్చి కొంతమందిని మాత్రమే గుర్తించి మిగతా వారిని గాలికి వదిలేసారని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు బాధితులందరికీ ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி