మంత్రి ఉత్తమ్ ఆదివారం కోదాడ, హుజర్ నగర్ నియోజకవర్గాల్లో పర్యటన షెడ్యూల్ ను అధికార వర్గాలు శనివారం వెల్లడించాయి. ఉదయం 7.30 గం.లకు నడిగూడెం మండలం కెఆర్సీపురం కాలువ గండి మరమత్తు పనుల పరిశీలన, 9.00 గం.లకు కోదాడ రెడ్లకుంట మేజర్ గండి మరమత్తు పనులు, 10.30 గం.లకు హుజూర్ నగర్ లో కరక్కాయల గూడెం దగ్గర ముక్త్యాల మేజర్ కాలువ గండి మరమత్తు పనులు, 12.00 గం.లకు మఠంపల్లి మండలం, చౌటపల్లి చెరువు మరమత్తు పనులు పరిశీలిస్తారు.