డ్రగ్స్ను సరఫరా చేసేందుకు స్మగ్లర్లు కొత్త పద్దతిని ఎంచుకున్నారు. ఏకంగా చిన్న పిల్లల లంచ్ బాక్స్ లో డ్రగ్స్ ను సరఫరా చేసేందుకు సిద్ధమయ్యారు. శనివారం అహ్మదాబాద్లో క్రైమ్ బ్రాంచ్తో పాటు కస్టమ్స్, ఎక్సైజ్ విభాగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో చిన్నారుల బొమ్మలు, చాక్లెట్లు, లంచ్ బాక్స్లు, క్యాండీ విటమిన్లలో దాచి ఉంచిన రూ. 1.15 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక స్మగ్లర్ ను అదుపులోకి తీసుకున్నారు.