తెలంగాణ నుంచి ఆంధ్రకు చనిపోయిన కోళ్ల సరఫరా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్
చేస్తున్నాయి. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు చెక్పోస్టు వద్ద అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. విస్సన్నపేటలో ఉన్న చికెన్ షాపులకు తెలంగాణకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన చనిపోయిన కోళ్లు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, APలోని చెరువులలో చేపలకు ఈ చనిపోయిన కోళ్లను మేతగా వేస్తున్నట్లు తెలుస్తోంది.