రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల ప్రభుత్వం భర్తీ చేసిన 58 రేషన్ షాపులను తమకే కేటాయించాలని గతంలో రేషన్ డీలర్లుగా పని చేసిన దాదాపు 30 మంది సాయి నగర్ వాటర్ ట్యాంక్ ఎక్కి పెట్రోల్ బాటిల్తో గురువారం నిరసన తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.