రాజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

73பார்த்தது
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకొని స్వామి సేవలో తరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారి వెంట ఆలయ అధికారులు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

தொடர்புடைய செய்தி