హనుమాన్ ఆలయంలో శని త్రయోదశి ప్రత్యేక పూజలు

58பார்த்தது
మానకొండూర్ మండలం పోచంపల్లి హనుమాన్ ఆలయంలో ఆఖరి శనివారం శని త్రయోదశి రావడంతో అర్చకులు సతీష్ ఆచార్యులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. హనుమంతుని విగ్రహానికి తైలాభిషేకం, నెయ్యి అభిషేకం, పుష్పాభిషేకం లాంటివి నిర్వహించి తమలపాకులతో హనుమంతుని అలంకరించారు. హనుమాన్ ఆలయంలో హనుమాన్ చాలీసా పటించారు. భక్తులు నవగ్రహాల చుట్టూ తిరిగి నెయ్యి దీపం వెలిగించి శాంతి పూజలు చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி