ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామంలోని ఫిల్టర్ బెడ్ ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులు, మండల నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ధర్మపురి మున్సిపాలిటీ, మండలానికి శాశ్వత నీటి పరిష్కారం చూపే విధంగా అమృత్ స్కీమ్ కింద సుమారు రూ. 17 కోట్ల వ్యయంతో వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.