మృతదేహంతో ఆర్ఎంపి వైద్యుడు ఇంటిముందు ధర్నా

1079பார்த்தது
సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం వడ్డేపల్లిలో ప్రశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. చింతల్ చెరువుకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ రవీందర్ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల మృతి చెందాడంటూ ఆరోపిస్తూ బంధువుల ఆందోళన చేపట్టారు. ప్రశాంత్ మృతదేహంతో ఆర్ఎంపీ వైద్యుడి ఇంటి ముందు శుక్రవారం ధర్నా చేపట్టారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி