కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాపన్నగౌడ్ జయంతి

64பார்த்தது
దుబ్బాక పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలు వేసి నివాళులర్పించారు. అబ్బుల బాలగౌడ్, గుండా శంకర్, కర్ణంపల్లి రమేష్ గౌడ్, శివరాజం గౌడ్, భూపాల్ గౌడ్, నరసింహులు గౌడ్, నర్సా గౌడ్, మహేష్, రాజు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி