స్వచ్ఛదనం-పచ్చదనం మనందరి బాధ్యత: దుబ్బాక సీఐ

80பார்த்தது
స్వచ్ఛదనం-పచ్చదనం మనందరి బాధ్యత అని దుబ్బాక సీఐ శ్రీనివాస్ శనివారం అన్నారు. దుబ్బాక ఎస్సై గంగరాజుతో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. సందర్భంగా వారు మాట్లాడుతూ. పర్యావరణంతోనే ప్రజలంతా సంతోషంగా ఉంటారని అన్నారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో మొక్కలను విరివిరిగా పెంచాలన్నారు. అలాగే ప్రతి వార్డులో పరిశుభ్రతను పాటించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி