సహకార సంఘంలో జరిగిన అవినీతి పై చర్యలు తీసుకోవాలి

1052பார்த்தது
సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జరిగిన అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ దుబ్బాక ఇన్ ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. దుబ్బాకలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు అవినీతికి పాల్పడ్డారని, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపడుతామన్నారు.

தொடர்புடைய செய்தி