శ్రీరామనవమిని పురస్కరించుకుని హైదరాబాద్ మహానగరంలో శ్రీరాముడి శోభాయాత్ర ఆదివారం రాత్రి ప్రశాంతంగా ముగిసింది. ధూల్పేటలో ప్రారంభమైన శోభాయాత్ర కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగింది. జై శ్రీరామ్ నామస్మరణతో నగర వీధులు మార్మోగాయి. హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి సభ లేకుండానే శోభాయాత్ర ముగిసింది. భక్తులు పెద్ద సంఖ్యలో శోభాయాత్రలో పాల్గొన్నారు.